జగదేవ్పూర్, జనవరి 3: సులభంగా ఉపయుక్తంగా పాఠ్యాంశానికి అనుకూలంగా చిన్నారులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడానికి ఉపయోగించే సాధనం టీఎల్ఎం అని ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి అన్నారు. మంగళవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాలులో మండలస్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు. ఈ మేళాలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం)ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతున్నదన్నారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఉపాధ్యాయులు వారి వృత్తిపై పునరంకితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, నాచారం దేవస్థానం డైరెక్టర్ బుద్ధనాగరాజు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్గౌఔడ్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శేఖర్, శంకర్, వెంకట్కిరణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చల్లా బాలకిషన్, మాసపాక యాదగిరి తదితరులున్నారు.