కొల్చారం/చిలిపిచెడ్/శివ్వంపేట, నవంబర్ 10: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కొల్చారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నర్సాపూర్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి నామినేషన్కు మద్దతుగా తరలివెళ్లారు. వరిగుంతం నుంచి జడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల, రంగంపేట నుంచి డీసీఎంఎస్ వైస్చైర్మన్ అరిగె రమేశ్, సంగాయిపేట నుంచి మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, చిన్నాఘన్పూర్ నుంచి సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, అంసాన్పల్లి నుంచి డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రాంపూర్ నుంచి జంగిటి పోచయ్య, గోవర్థ్దన్రెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్రెడ్డి, నెల్లిరాజు, కిష్టాపూర్ నుంచి సర్పంచ్ గోదావరి, ఎనగండ్ల నుంచి సర్పంచ్ వీరారెడ్డి, పైతర నుంచి మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్రెడ్డి, కోనాపూర్ నుంచి మండల యువత అధ్యక్షుడు సంతోష్రావు, కొంగోడు నుంచి వేమారెడ్డి, కొల్చారం నుంచి ముత్యం ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నామినేషన్కు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
* నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న వాకిటి సునీతాలక్ష్మారెడ్డికి మద్దతుగా మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం భారీగా తరలివెళ్లారు. మండలంలోని చండూర్, చిలిపిచెడ్, అజ్జమర్రి, చిట్కుల్ ఆయా గ్రామాల్లో నుంచి మాజీ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడ్డం నరేందర్రెడ్డి, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ తరలివెళ్లారు.
* నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీకి శుక్రవారం శివ్వంపేట మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.