పేదరికంలో మగ్గిన దళితుల జీవన విధానాన్ని దళితబంధు పథకం మార్చేస్తున్నది. అరిగోస పడినచోటే ఆత్మగౌరవంతో జీవించేలా తోడ్పాటును అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి అందిస్తున్న రూ.పది లక్షలతో యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవితానికి బాటలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో లబ్ధిదారులు తమ కాళ్ల మీద తాము నిలబడి..మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల నుంచి రూ. 10 వేలు సేకరించి, మరో రూ 10 వేలు ప్రభుత్వం జమచేసి దళిత రక్షణనిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు ధీమాను కల్పిస్తున్నది. తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1194 కుటుంబాలకు రూ.115.40 కోట్లు అందించింది.వారంతా ఇష్టమైన యూనిట్లు ఎంచుకుని విజయవంతంగా నడుపుకొంటున్నారు. నిన్నమొన్నటి వరకు కూలీలుగా ఉన్న దళితులు ఓనర్లుగా మారి మెరుగైన జీవితం గడుపుతున్నారు. మూడు పూటలా తిండికి కష్టమైన తమ జీవితాలు సరికొత్త ఆదాయ మార్గాలతో మలుపు తిరిగాయని దళిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
సిద్దిపేట, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రభుత్వం దళితబంధు కింద అందించిన ఆర్థిక సాయంతో లబ్ధిదారులు బాగు పడి తమ కాళ్ల మీద తాము నిలబడి..మరో పది మందికి ఉపాధినిస్తున్నారు.దళితబంధు పథకం దళితుల ఆర్థికాభివృద్ధి తోపాటు సామాజిక అసమానతలు తగ్గించడానికి దోహదపడుతున్నది. దళితబంధు సాయం పొందిన కుటుంబాలు మరో పది కుటుంబాలకు వెలుగులు పంచుతున్నాయి. ఒక్కో లబ్ధిదారునికి రూ. 10 లక్షల చొప్పున లబ్ధిదారుకు ప్రభుత్వం పూర్తి గ్రాంట్గా ఆర్థిక సాయం అందించింది. రక్షణ నిధిని సైతం ఏర్పాటు చేసింది. లబ్దిదారుల నుంచి రూ. 10 వేలు సేకరించి, మరో రూ 10 వేలు ప్రభుత్వం జమ చేసి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు ధీమాను కల్పిస్తున్నది.
తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.115.40 కోట్లు 1,194 కుటుంబాలకు అందించింది.వారంతా ఇష్టమైన యూనిట్లు ఎంచుకుని విజయవంతంగా నడుపుకొంటున్నారు. ప్రభుత్వం అందించిన చేయూతతో ఒకరు పాడిపరిశ్రమ, మరొకరు నాలుగు చక్రాల వాహనాలు, ల్యాబ్ టెకిక్నీషియన్, కారు ట్యాక్సీ..క్లాత్ ఎంపోరియం ..వరికోత మిషన్, టెంట్హౌస్, కోళ్ల ఫారం.. ఇలా అనేక వ్యాపారులు ప్రారంభించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,194 కుటుంబాలకు దళతబంధును అందించారు. సిద్దిపేట జిల్లాలో 495 కుటుంబాలకు రూ.45.50 కోట్లు, మెదక్ జిల్లాలో 255 కుటుంబాలకు రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444 కుటుంబాలకు రూ.44.40 కోట్లు కుటుంబాలకు అందించారు.ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ. 10 లక్షల ఆర్థ్ధిక చేయూతను అందించింది. దళిత బంధులో 60కి పైగా ఉన్న వివిధ రకాల యూనిట్లలో వారికి నచ్చిన వాటిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం అందించిన సాయం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకాన్ని మరింతగా విస్తరించాలని చెప్పి ప్రతి నియోజకవర్గానికి 1100ల యూనిట్లు కేటాయించారు. ఈ లెక్కన ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్ చెరు నియోజకవర్గాలతో పాటుగా సిద్దిపేట జిల్లాలోని జనగామ నియెజకవర్గంలోని నాలుగు మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం ఉన్నాయి.11 నియోజక వర్గాలకు లెక్క వేసుకున్నా సుమారుగా 12 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ఆ దిశగా లబ్ధ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారిని ఎంపిక చేసి గ్రౌండింగ్ చేస్తున్నారు. వెంటనే యూనిట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దళితబంధు కార్యక్రమం ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.సీఎం కేసీఆర్ నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళిత చైతన్యజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 25 ఏండ్ల కిందట సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం మగ్దుంపూర్, చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామాలతో పాటు దుబ్బాక మండలం రాజక్కపేట, ఎల్లాపూర్ గ్రామాల్లోని దళిత చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం రాజక్కపేట, ఎల్లాపూర్ గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నాయి. దళిత చైతన్యజ్యోతి కార్యక్రమం ఉద్దేశాలను ఆనాడే కేసీఆర్ వారికి వివరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాడల్గా తీసుకున్న గ్రామాల్లోని దళిత వాడల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి చేపట్టారు. అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. దళితుల అభ్యున్నతికి మాడల్గా తీసుకున్న గ్రామాల్లోని వారి కోసం ట్రాక్టర్లు ఇప్పించారు. ఏ పని అయినా సామూహికంగా చేసుకోవాలని సూచించారు. సామూహిక వ్యవసాయ బావుల తవ్వకం కోసం క్రేన్లు ఇప్పించారు. ఇండ్లు కట్టుకునేలా ప్రోత్సహించి నిర్మించారు. శ్రమదానాలు చేసి రోడ్లు వేసుకున్నారు. ఇలా ఎన్నో పనులు చేపట్టారు. నాటి దళిత చైతన్య జ్యోతి కార్యక్రమం స్ఫూర్తితోనే ఇవ్వాళ ‘దళితబంధు’ కార్యక్రమం ప్రవేశపెట్టి రాష్ట్రంలో దిగ్విజయంగా అమలు చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని దళితబంధు పథకంతో డ్రైవర్గా ఉన్న నేను ఓనరునయ్యాను. హైదరాబాద్లో డ్రైవర్గా జీతం చేస్తూ నానా ఇబ్బందులు పడ్డాను. దళితబంధు పథకంలో నేను ట్రాక్టర్ను కొనుగోలు చేశాను. నా పొలం పనులను సొంత ట్రాక్టర్తోనే చేసుకుంటూ ఇతరులకు కిరాయికి వెళ్తున్నా. సొంత గ్రామంలోనే ఉంటూ ఉపాధి పొందడం చాలా సంతోషంగా ఉంది. ట్రాక్టర్తో అన్ని ఖర్చులు పోనూ నెలకు సుమారు రూ.30నుంచి 35 వేల వరకు సంపాదిస్తున్నాను. జీతం కోసం డ్రైవర్ పని చేసినప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాను. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఓనర్ ఏది చెబితే అది చేసేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయవల్ల ఆత్మగౌరవంతో సొంత గ్రామంలో బతుకుతున్నాను. ట్రాక్టర్కు పని బాగా దొరకడంతో ఆర్థికంగా బలపడుతున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేలును ఈ జన్మలో మర్చిపోలేను. దళితులు బాగు పడాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్కు మా దళితుల మద్దతు ఎప్పటికీ ఉంటది.
రామాయంపేట రూరల్, నవంబర్ 1: సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దళితబంధులో ఆర్థికంగానిలదొక్కుకుంటున్న. దళితబంధుతో ప్రభుత్వం రూ.10 లక్షలు అందజేసింది. దీంతో నా సొంత వ్యవసాయ పొలంలో ఫౌల్ట్రీ ఫాం షెడ్డును నిర్మిస్తున్నా. సుమారు 5వేల కోళ్ల పెంపకం కోసం ఈ నిర్మాణాన్ని చేపడుతున్నా. మరో వారం రోజుల్లో కోడి పిల్లలు వస్తాయి. వాటితో నా జీవనోపాధి మెరుగుపడుతుంది. గతంలో వ్యవసాయ కూలీగా పని చేసి కుటుంబాన్ని పోషించేవాడిని. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన దళితబంధుతో నా కల సాకారమైంది. వారం లోపల కోడి పిల్లలు రావడంతో 42 రోజుల్లో ఓ విడత అమ్మకానికి వస్తాయి. అప్పటివరకు వాటిని సాకుతూ, కుటుంబసభ్యులతో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం. దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు అందించిన సీఎం కేసీఆర్కు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటాం. దళితబంధు అందించిన సీఎం కేసీఆర్ సార్ను జీవితాంతం గుర్తుంచుకుంటాం.
నిజాంపేట మండలం రాంపూర్కు చెందిన నర్సింహులు, నేను కలిసి దళితబంధు పథకం కింద హార్వేస్టర్ను కొనుగోలు చేశాం. రూపాయి ఖర్చు కానీ, పైరవీలు లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన హార్వేస్టర్తో రాంపూర్ గ్రామ చుట్టుపక్కలా 2 నెలలపాటు వరి కోతలు కోసి నం. దాదాపుగా రూ.1.40 వేల ఆదాయం వచ్చింది. సీఎం కేసీఆర్ సార్ తీసుకొచ్చిన దళితబంధు పథకంతో దళితుల బతుకులు మారా యి. వేరే వాళ్ల దగ్గర కూలీలుగా ఉన్న మేము నేడు దళిత బంధుతో ఓనర్లుగా మారినం. అప్పు లేకుండా ప్రభుత్వం హార్వేస్టర్ను ఇవ్వడంతో వచ్చిన ప్రతి పైసా లాభమే. మా బతుకులను మార్చిన సీఎం కేసీఆర్ మాకు దేవుడు. ఆయనకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
15 సంవత్సరాలుగా సుతారి, సెంట్రిగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగించాను.సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారం వల్ల దళిత బంధు పథకం కింద సెంట్రింగ్ డబ్బాతో పాటు మిల్లరు మిషన్ తీసుకున్నా.. కూలీగా పనిచేసిన నేను సెంట్రింగ్ సామగ్రితో ఓనర్గా మారడం సంతోషంగా ఉంది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం పొందుతున్నా. మాలాంటి ఆనేక మంది దళితుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది. మేము సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం..మా ఎదుగుదలకు ఆండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తుంది.