నర్సాపూర్/ వెల్దుర్తి, నవంబర్ 27 : విద్యార్థులు సైన్స్ దృ క్పథాన్ని పెంపొందించుకుని, పరిశోధనలు చేయాలని డాక్టర్ నర్సింహరెడ్డి సూచించారు. జిల్లాస్థాయి చెకుముఖి సైన్స్ టా లెంట్ టెస్ట్ను ఆదివారం నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ నర్సింహరెడ్డి, రిటెర్డ్ హెడ్మాస్టర్ షఫీయొద్దీన్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ..సైన్స్తో సమాజం పురోగతి చెందుతుందన్నారు.
ప్రతి విద్యార్థి సైన్స్పై అభిరుచి పెంపొందించుకోవాలని, శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు. నమ్మకాలు, మూఢనమ్మకాలకు చాలా వ్యత్యాసం ఉందన్నా రు. శారీరక వ్యాయామం ఆవశ్యకత, జ్ఞాపకశక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే అంశాలను వివరించారు. కార్యక్ర మంలో ఎంఈవో బుచ్యనాయక్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు మోహన్, ప్రతినిధులు బాబూరావు, పండరి, శ్రీనివాస్, రమేశ్రాజు, చంద్రశేఖర్, కామేశ్వరరావు, వెంకటరమణ, యోగి, శంకరాచారి, శంకర్, గణేశ్, అశోక్కుమార్, రమేశ్చౌదరి, నాలెడ్జ్ సెంటర్ ఇన్చార్జ్జి శ్రీనివాస్ ఉన్నారు.
సైన్స్ఫెయిర్, చెకుముఖి పోటీల్లో సత్తాచాటిన
మంగళపర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
వెల్దుర్తి, నవంబర్ 27 : మూడు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్తోపాటు, ఆదివారం జరిగిన చెకుముఖి పోటీల్లో మండలంలోని మంగళపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి ద్వితీయ స్థాయి బహుమతులను సాధించారు. ఈ నెల 24 – 26 వరకు జిల్లాకేంద్రం మెదక్లో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్లో పాఠశాలకు చెందిన విద్యార్థి సతీశ్కుమార్ రసాయనాలు లేని ఇం టిని శుభ్రం చేసే క్లీనర్ను రూపొందించి ప్రదర్శించారు.
ఈ ప్రదర్శన రెండోస్థానంలో నిలువగా శనివారం రాత్రి నిర్వహించిన సైన్స్ఫెయిర్ ముగింపు సంబురాల్లో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, డీఈవో రమేశ్కుమార్ తదితరులు విద్యార్థి సతీశ్, గైడ్ టీచర్ నరేందర్కు బహుమతి అందజేశారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన చెకుముఖి పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు శిరీష, నాగరాజు జిల్లా స్థా యిలో ద్వితీయ బహుమతిని సాధించారు. జిల్లాస్థాయి పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను, వారిని గైడ్ చేసిన ఉపాధ్యాయులను ఎంఈవో యాదగిరి అభినందించారు.