శివ్వంపేట, నవంబర్ 30: ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం శివ్వంపేట మండల పరిధిలోని లచ్చిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వొరం అనూషకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.లక్ష చెక్కును సర్పంచ్ అశోక్రెడ్డికి ఆమె అందజేశారు.
నర్సాపూర్ మున్సిపల్కు చెందిన గుల్లయ్యగారి నర్సింలుకు మంజూరైన రూ. లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ నయీమోద్దీన్, సీనియర్ నాయకులు సత్యంగౌడ్, డైరెక్టర్ సూరారం నర్సింలు, షేక్ హుస్సేన్, తొంట వెంకటేశ్, అశోక్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, మన్నె శ్రీనివాస్ తదితరులున్నారు.