రామాయంపేట/నిజాంపేట/చిన్నశంకరంపేట/రామాయంపేట రూరల్/పాపన్నపేట, నవంబర్ 29: నేడు(గురువారం) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెదక్ నియోజకవ ర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 13 మంది అభ్యరులు బరిలో ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మండల ఎన్నికల అధికారి, పురపాలిక కమిషనర్ ఉమాదేవి పోలింగ్ బూత్లను పరిశీలించారు. పట్టణంలోని 74, 78 బూత్లను మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. వాటిని మండల ఎన్నికల అధికారి ఉమాదేవి పరిశీలించారు. బూత్లలో మహిళలకు, పురుషులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రామాయంపేట పురపాలికలోని 14 పోలింగ్ బూత్లు కాగా మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో 25 పోలింగ్ బూత్లు మొత్తం 39 బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పారామిలిటరీ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.మిలటరీ బలగాలు ఎన్నికలకు వస్తున్న సిబ్బందిని అణువణువు పరిశీలిస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓట్లు వేయడం కోసం దివ్యాంగులకు ప్రత్యేకంగా వీల్చైర్లను ఏర్పాటు చేసినట్లు మండల ఎన్నికల అధికారి వెల్లడించారు.
* అసెంబ్లీ ఎన్నికలకు నిజాంపేట మండల వ్యాప్తంగా 28 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం పోలింగ్ సిబ్బంది సామగ్రితో చేరుకున్నారు. ఈ మేరకు నందిగామలో పోలింగ్ కేంద్రాలు 106, 107లకు సంబంధించిన సామగ్రితో పోలింగ్ సిబ్బం ది చేరుకున్నారని, వారికి అన్ని రకాల వసతులను కల్పించామని పంచాయతీ కార్యదర్శి ఆరీఫ్హుస్సేన్ తెలిపారు. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్దకు భద్రత బలగాలు చేరుకున్నాయి. కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది ఉన్నారు.
* అసెంబ్లీ ఎన్నికలకు రామాయంపేట మండలంలో అన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్ల్లో అధికారులు సర్వం సిద్ధం చేశా రు. బుధవారం పోలింగ్ అధికారులు బూత్ల్లో ఏర్పాట్లు పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా, దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామ ని, ప్రశాంతంగా పోలింగ్ జరగడంతోపాటు పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తామని అధికారులు వెల్లడించారు.
* నేడు జరగనున్న శాసనసభ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన్నశంకరంపేట మండలంలో వివి ధ గ్రామాల్లో అధికారులు 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి నలుగురు ఎన్నికల సిబ్బందితో పాటు ఒక అబ్జర్వేటర్ను నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో 30,372 మంది తమ ఓటు హక్కును వినియోగిచుకోనున్నారు. ఇందులో 15,616 మంది మహిళా ఓటర్లు, 14,756 మంది పురుషులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు.
* పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మండల వ్యాప్తంగా 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఏపీఓ, ఇద్దరు పోలింగ్ అధికారుల చొప్పున ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రానికి సంబంధిత ఎన్నికల సిబ్బంది అధికారులు చేరుకున్నారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.