అక్కన్నపేట, ఫిబ్రవరి 2: నిషేధిత గుడుంబా తయారు, రవాణా, విక్రయాలు, బెల్లం సరఫరా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్, అక్కన్నపేట ఎస్సై వివేక్ వేర్వేరుగా హెచ్చరించారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గుప్పుమంటున్న గుడుంబా’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ పవన్, జిల్లా టా స్క్ ఫోర్స్, అక్కన్నపేట ఎస్సై వివేక్ ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా వి క్రయ కేంద్రాలు, గిరిజన తండాల్లో విస్తృతంగా దాడులు చేసి తనిఖీలు చే పట్టారు. అక్కన్నపేట ఎస్సై వివేక్ మండల కేంద్రంలో కూతాటి పోచయ్య ఇంట్లో తనిఖీ చేసి గుడుంబా ప్యాకెట్లను (సుమారు 6లీటర్లు) స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చే శారు. మరో నలుగురు గుడుంబా విక్రయదారులను బైండోవర్ చేశారు. మరోవైపు హుస్నాబాద్ ఎక్సైజ్ స్టే షన్ సీఐ పవన్ నేతృత్వంలో ఎస్సై దా మోదర్, టాస్క్ఫోర్స్ ఎస్సై సరిత, స్థా నిక పోలీసులు సంయుక్తంగా గిరిజన తండాల్లో తనిఖీలు చేశారు.
గతంలో గుడుంబా కేసుల్లో ఉన్న పాత నిందితుల ఇండ్లపై దాడులు చేశారు. నాటుసారా తయారీ స్థావరాలకు వెళ్లి గుడుంబా కోసం ఉపయోగించే 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశా రు. లీటర్ సారా స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేశారు. గడిచిన రెండు నెలల్లో గుడుంబాకు సం బంధించి 13 కేసులు నమోదు చేసి ఐదుగురిని ఆరెస్ట్ చేసి 800లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని, 49 లీటర్ల నాటుసారా, నాలుగు ద్విచ క్ర వాహనాలు, 60కేజీల బెల్లం, 240 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నామన్నారు. సక్రమంగా విక్రయించని బెల్లం వ్యాపారులకు నోటీసు లు జారీ చేశామని పేర్కొన్నారు. 11 మందిని బైండోవర్ చేశామని, బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి రూ. 50 వేల జరిమానా విధించామన్నారు. తనిఖీల్లో హెడ్కానిస్టేబుళ్లు రాజమల్లారెడ్డి, చెన్నగౌడ్, కానిస్టేబుళ్లు, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.