జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు పాల్గొన్నారు. హవేళీఘనపూర్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన కల్యాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరయ్యారు.
హవేళీఘనపూర్ మండ లం కూచన్పల్లి హనుమాన్ ఆలయంతోపాటు రామాయంపేటలో జరిగిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి దంపతులు హాజరయ్యారు. మనోహరాబాద్ మం డలంలోని కూచారం, కాళ్లకల్ గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి హాజరయ్యారు. నర్సాపూర్తోపాటు గ్రామాల్లో జరిగిన ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి హాజరయ్యారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, మార్చి 30