రామచంద్రాపురం, మే15 : గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం భెల్ జడ్పీహెచ్ఎస్లో మండలస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల స్థాయిలో రాణించిన వారిని జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడుతుందని చెప్పారు.
క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, ఎంఈవో జెమినికుమారి, తహసీల్దార్ జయరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, నాయకులు పరమేశ్యాదవ్, ప్రమోద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.