పటాన్చెరు, మార్చి 3: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 24 గంటలు షీ టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని మైత్రీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి బెలూన్స్ ఎగురవేసి, శాంతికపోతాలను వదిలి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారిని రాజకీయాల్లోనూ బలోపేతం చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. పారిశ్రామికరంగంలోనూ మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలపై రుణాలు అందజేస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, సంఘాలు, విద్యార్థినులు, మహిళా ప్రజాప్రతినిధుల్లో ప్రతిభ ఉంటుందని గుర్తించి వారిని ఈ మహిళా దినోత్సవం రోజు ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలు అధికంగా పాల్గొనాలని కోరారు. మార్చి 8న హోలీ పండుగ ఉండటంతో ముందస్తుగా మార్చి 6న మహిళా దినోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే సతీమణి, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు గూడెం యాదమ్మ మాట్లాడుతూ క్రీడా సంబురాల్లో మహిళలందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, ప్రవీణా వినయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు కొలన్ రోజా బాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, ఆదర్శ్రెడ్డి, మెట్టు రమాదేవి కుమార్యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కొలన్ బాల్రెడ్డి, గూడెం మధుసూదన్రెడ్డి, గూడెం యాదమ్మ, వెంకటేశంగౌడ్, శ్రీధర్చారి, మెరాజ్ఖాన్, తొంట అంజయ్యయాదవ్, చంద్రశేఖర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బీ పాండు, పట్టణాధ్యక్షులు అఫ్జల్ అలీ, వంగరి అశోక్, ఎంపీటీసీలు నీనా చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, గాయత్రి పాండు, ఎంపీటీసీ నాగజ్యోతి గోల్కొండ లక్ష్మణ్, సర్పంచ్ సుమతీ రామచందర్, ఎంఈవో పీపీ రాథోడ్, ఏపీఎం శ్రీనివాస్, శకీల్, రామకృష్ణముదిరాజ్, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.