మెదక్ మున్సిపాలిటీ, మే 28: భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి శాంతయ్యతో పాటు పాస్టర్లు దైవసందేశం చేశారు.
అనంతరం భక్తులను ఆశ్వీరదించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వసతి గృహాలు లభించక పోవడంతో చెట్ల కిందే వంటావార్పు చేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చర్చి కమిటీ సభ్యులను పలువురు భక్తులు కోరారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సువణ్ డగ్లస్, నోబుల్సన్, జాన్సన్, సంశాన్ సందీప్, సునీల్, పాస్టర్లు డేవిడ్, జైపాల్, శ్రీనివాస్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.