పాపన్నపేట, ఫిబ్రవరి 17: ఏడుపాయల జాతర మొత్తం సీసీటీవీ పరిధిలో ఉందని ఎలాంటి సంఘటనలు జరిగినా తెలిసిపోతుందని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏడుపా యల వనదుర్గా అమ్మవారి జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తు ను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతర ప్రాంగణం లో మొత్తం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉన్నదన్నా రు. జాతరకు వచ్చే భక్తులు అనుమానిత వస్తువులను తాకవద్దని సూచించారు. పోలీసులు చూపిన ప్రాంతాల్లో వా హనాలు పార్కింగ్ చేసుకోవాలి.
చిన్నపిల్లలు, వృద్ధు లు జాగ్రత్తగా ఉండాలన్నా రు. అత్యవసర సమయాల్లో పో లీసు కంట్రోల్రూం ద్వారా పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్కింగ్ స్థలాలు విధులు నిర్వహిస్తు న్న అధికారులు సిబ్బంది వాహనాలకు ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలని సూ చించారు. జాతరలో ఏదైనా ఇబ్బంది కలిగితే డయల్ 100కి కానీ దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి కానీ తెలుపాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదు లు తూప్రాన్ డీఎస్పీ యాదగిరి, పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ పాల్గొన్నారు.