‘ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీకి అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్సే.. తెలంగాణ ప్రభుత్వంపైన,
ముఖ్యమంత్రి కేసీఆర్పై వివిధ సోషల్ మీడియాల్లో ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ పిచ్చివాగుడు వాగే వారికి లెక్కలతో సహా సమాధానం చెప్పాలి..’అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో బీఆర్ఎస్ జిల్లా సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఎమ్మెల్సీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్తో కలిసి పాల్గొ న్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాని బీఆర్ఎస్ వారియర్స్కు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల నాటికి ఊరూరా సోషల్ మీడియా మరింత పటిష్టం కావాలన్నారు.
– జనగామ, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
జనగామ, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలు, సిసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్సే.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై సోషల్ మీడియాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ సమాధానం చెప్పాలని’ అని ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సోషల్ మీడియా మరింత పటిష్టం కావాలని, ప్రతిపక్ష పార్టీల తప్పుడు పోస్టులను వాస్తవిక అంశాలతో ఎదుర్కొవాలన్నారు. ఒకప్పుడు జనగామ తాలూకా నల్లగొండ ప్రాంతంలో ఉండేదని, తర్వాత వరంగల్ జిల్లాలో కలిసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లా అయిందన్నారు. జనగామ ప్రాంతంలో ప్రతీ ఊరు, ప్రతీ మనిషికి ఒక చరిత్ర ఉన్న త్యాగాల గడ్డ అన్నారు.
నిజాం వెట్టి చాకిరి విముక్తి ప్రజాపాలనకు, నిజాం దోపిడీకి వ్యతిరేకంగా జరిగి పోరాటంలో నాలుగు వేల మంది అమరలయ్యారన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది జనగామ ప్రాంతమన్నారు. కడవెండి, మద్దూరు, లద్నూర్, బైరాన్పల్లి, నర్మె ట, సలాక్పూర్ వంటి గ్రామాలకు చరిత్ర ఉందన్నారు. సీఎం కేసీఆర్ జనగామ జిల్లా ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీ ఇచ్చారని, అద్భుతమైన దవాఖాన నిర్మిసున్నారని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టు గండిరామారం, బొమ్మకల్, తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా రైతులకు సాగునీరు ఇస్తు న్నామని, మల్లన్నసాగర్ కాల్వలు తవ్వుకుంటు న్నామన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతులకు సాగునీరు అందించడంలో ముందున్నారని తెలిపారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో అత్యధికంగా వరి ధాన్యం పండే ప్రాంతం జనగామ అన్నారు.
తాగునీటిపై పిచ్చికూతలు..
ఓ టీవీ ఇంటర్యూలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు జనగామకు ఏం చేయలేదని దారుణంగా మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో రైతులకు 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయం, రైతుబీమా, పండించిన పంటలు కొన్నారా అని ప్రశ్నించారు.
కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు 24 గంటల కరెంటు, రైతుబీమా, పెట్టుబడి సాయం, పండిన ధాన్యం కొంటున్నారా? సమాధానం చెప్పాలని పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ మీరు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదో చెప్పండి అని నిలదీశారు. నిజాయితీ ఉంటే మీ రాష్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
పోస్టులు పెట్టేటప్పుడు స్పష్టత కావాలి..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సోషల్ మీడియా ప్రతినిధులకు స్పష్టత ఉండాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్కు ఎమ్మెల్సీ పల్లా స్పష్టం చేశారు. మనల్ని ఎవరైనా విమర్శిస్తే.. మళ్లీ విమర్శించకుండా దానికి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, యూట్యూబ్ వేదిక ద్వారా కేసీఆర్, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే గణాంకాలతో సహా వాస్తవాలను పోస్టు చేయాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో టచ్లో ఉంటానని, మండలాల వారీగా మాట్లాడుతానని చెప్పారు.