పుల్కల్, ఫిబ్రవరి 6: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే జలవిద్యుత్ కేంద్రం నుంచి మూడో విడతగా 1460 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీవాహక ప్రాంతాల ప్రజలు మత్స్యకారులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 22.957 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.