గజ్వేల్, ఫిబ్రవరి 2: కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెట్టాయని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్యార్డు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్, పంచాయతీ భవనాలు, క్రీడాప్రాంగణాలు, సిటిజన్ భవనాలు, మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గ్రామాల్లో కోట్లాది రూపాయల పనులు వేగవంతంగా జరిగాయన్నారు. కేసీఆర్, హరీశ్రావుల కృషితో సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు చంద్రమోహన్రెడ్డి, మద్దిరాజరెడ్డి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 2: మద్దూరు తాజా మాజీ సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్రెడ్డిని గ్రామస్తులు సన్మానించారు. ఎంపీటీసీ కనకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ ఐదేండ్ల వ్యవధిలో గ్రామాన్ని అభివృది ్ధపథంలో తీసుకెళ్లినట్లు చెప్పారు. సమావేశంలో ప్రత్యేకాధికారి శ్రీనివాస్గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచ్ ఆరీఫ్, మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వర్గల్, ఫిబ్రవరి 2: కేసీఆర్ హయాంలోనే గ్రామాలు ప్రగతిబాట పట్టాయని వర్గల్ ఎంపీపీ లతారమేశ్గౌడ్ అన్నారు. మజీద్పల్లిలో సర్పంచ్ లతాశివరాంగౌడ్, పంచాయతీ వార్డు సభ్యులను గ్రామస్తుల ఆధ్వర్యంలో సన్మానించారు.
కొమురవెల్లి, ఫిబ్రవరి 2: మండలంలోని రాంగసాగర్ సర్పంచ్ రవీందర్ను కొమురవెల్లిలో సీపీఎం కార్యాలయంలో పార్టీ మం డల కార్యదర్శి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నాయకులు కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి, సాయిలు, మల్లేశం, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల, ఫిబ్రవరి 2: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర మరువలేనిదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగల ఏకానందం అన్నారు. మండలంలోని 18 గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.