మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేబర్తి గ్రామానికి చెందిన ఈరి రమేశ్(38) తన మిత్రుడు కూకట్ల భానుచందర్తో కలిసి రాత్రి 8గంటలకు ఇంటి నిర్మాణ సామగ్రి కోసం తన ఇంటి నుంచి మద్దూరు మండల కేంద్రానికి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రేబర్తి గ్రామానికి చెందిన అందె రాకేశ్ మద్దూరు నుంచి రేబర్తి వైపు పల్సర్ బైక్పై వస్తున్నాడు.
రేబర్తి-మద్దూరు గ్రామాల మధ్యలో గల ఏఆర్ గార్డెన్ సమీపంలోని మూల మలుపు వద్ద రమేశ్ బైక్ను రాకేశ్ తన బైక్తో అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా భానుచందర్, రాకేశ్లు గాయాలపాలయ్యారు. దీంతో స్థానికులు ముగ్గురిని చేర్యాల సర్కారు దవఖానకు తరలించగా.. వైద్యుల సూచనల మేరకు రమేశ్ను హైదరాబాద్కు అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందాడు. మృతునికి భార్య లావణ్య, కుమారులు గణేశ్, విష్ణు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.