హుస్నాబాద్టౌన్, డిసెంబర్ 28 : గౌరవెల్లి రిజర్వాయర్ పనులను ఎవరు అడ్డుకున్నా ఆగేదిలేదని, నిర్వాసితుల న్యాయమైన సమస్యలు తీర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవెల్లి రిజర్వాయర్లో ముంపుకు గురవుతున్న భూములకు ఇప్పటికే పరిహారం చెల్లించామన్నారు.
ఆర్అండ్ఆర్ ప్యాకెజ్ను చట్టపరంగా ఇస్తామని చెప్పామన్నారు. నిర్వాసితుల సమస్యలను ఇప్పటికే మంత్రి, కలెక్టర్తోపాటు సంబంధిత అధికారులతో మాట్లాడాం. 2021 దసరా వరకు 18 ఏండ్లు నిండిన 344మందికి యువతీ, యువకులకు ఆరులక్షల చొప్పున ప్యాకెజ్ ఇస్తామని చెప్పామన్నారు.
మిగిలిన వారికి సైతం ప్యాకెజ్ వర్తింపజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేవొడితెల సతీశ్కుమార్ చెప్పారు. 2007లో ఉన్న ప్యాకెజీతో రైతులకు మేలు జరగదని సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని జీవో తీసుకువచ్చి ఎకరానికి ఆరులక్షలకుపైగా పరిహారం ఇచ్చారని వివరించారు.
గ్రామంలోని 937 కుటుంబాలకు 93కోట్ల రూపాయల పరిహారం సైతం ఇవ్వడం జరిగిందని, మిగిలిపోయిన, తప్పిపోయిన వారికి సైతం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగాలని కోరుకునే వారిలో నేనే ముందు ఉంటానని చెప్పారు. రిజ్వాయర్ పనులు ఎందుకు అడ్డుకుంటున్నారో వారికే తెలియాలని, పనులను ఎట్టిపరిస్థితుల్లో ఆపేదిలేదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ చెప్పారు.
నిర్వాసితులు రాజకీయపార్టీల భ్రమల్లో పడకుండా పనులకు సహకరించాలని ఎమ్మెల్యే సతీశ్కుమార్ కోరారు. నిర్వాసితులకు తాము, ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఇందులో ఎటువంటి సందేహాలు అక్కరలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సమావేశంలో మున్సిపల్చైర్పర్సన్ ఆకుల రజితాత, వ్యవసాయమార్కెట్కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, మాజీమార్కెట్కమిటీచైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ. అన్వర్, మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.