గజ్వేల్ రూరల్, జనవరి12 : ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామానికి చెందిన రామగిరి జగన్ గజ్వేల్లో నివాసం ఉంటున్నాడు.
అతడి కొడుకు అనిల్(21) అల్వాల్లో ఫొటో స్టూడియోలో పని చేస్తున్నాడు. కాగా, మంగళవారం ఇంటికొచ్చిన అనిల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందాడు. కొడుకు మృతిపై అనుమానం ఉందని దర్యాప్తు చేయాలని తండ్రి జగన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.