సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 29 : సిద్దిపేటను గంజాయి రహిత జిల్లాగా మార్చుతామని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) అందె శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట కమిషనరేట్లో పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక-2023ను అడిషనల్ డీసీపీ (శాంతి భద్రతలు) మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5931 కేసులు నమోదయ్యాయని, ఈ సంవత్సరం 7శాతం నేరాలు పెరిగాయని వివరించారు. ఈ సంవత్సరం 13 మర్డర్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది 31.5శాతం నేరాలు తగ్గాయన్నారు. 670 చోరీ కేసులు నమోదు కాగా, 89పోక్సో కేసులు నమోదైనట్లు తెలిపారు. 15శాతం పోక్సో కేసులు పెరిగాయన్నారు. లైంగికదాడి కేసులు 73 నమోదైనట్లు తెలిపారు. 5 చైన్స్నాచింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 61.5శాతం చైన్స్నాచింగ్ తగ్గాయన్నారు. 540 రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదైనట్లు చెప్పారు. 260 మంది చనిపోగా, 480మందికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఏడాది 3.7 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు.
4.4శాతం మరణాల రేటు తగ్గాయని వివరించారు. ఈ సంవత్సరం 26శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 9713 కేసులు నమోదు చేసి, 28మందిని జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. 14 గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. వాహనాలపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా ఈ ఏడాది 86,533 కేసులు నమోదు చేసి 8,95,24,145 జరిమానా విధించినట్లు తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల్లో నేరస్తులకు 47శాతం శిక్షలు విధించినట్లు పేర్కొన్నారు. 3 కేసుల్లో నలుగురు నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 234 సైబర్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 148 కేసుల్లో 1,04,03,871 డబ్బులు ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం బైండోవర్ కేసులు 2944 నమోదు కాగా, 2983 మందిని బైండోవర్ చేశారు. ఈ ఏడాదిలో పేకాట ఆడిన వారిపై 26 కేసులు నమోదు చేసి 162 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 8225 (ఈపెట్టి) కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన వారిపై 4,922 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
7015 సీసీ కెమెరాలు ఏర్పాటు..
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో 7015 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా వివిధ రకాల (32) కేసులను ఛేదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు రమేశ్, సతీశ్, సురేందర్రెడ్డి, ప్రసన్నకుమార్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గురుస్వామి పాల్గొన్నారు.