సిద్దిపేట : జిల్లాలో 18 సంవత్సరాలు నిండి మొదటి, రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరు కూడా ఉండొద్దు. వంద త శాతం కరోనా టీకాలు వేయించేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కొవిడ్ వాక్సినేషన్ పురోగతి పై జిల్లా అధికారులతో IDOC నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమం అధికారులు, క్షేత్ర సిబ్బంది సమన్వయ సహకారంతో సంతృప్తి కరంగా సాగుతుందన్నారు.
వ్యాక్సినేషన్ వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు అకింత భావంతో కృషి చేయాలన్నారు.
ఫ్లోటింగ్ పాపులేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాక్సినేషన్ తీసుకోకపోతే మూడో వేవ్, ఒమిక్రాన్ వస్తే ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు వివరించి టార్గెట్ ఓరియంటెడ్ గా వ్యాక్సినేషన్ ను మిషన్ మోడ్ లో చేపట్టాలన్నారు.
ANM, సబ్ సెంటర్, PHC, CHC వారీగా ఇంకా మొదటి , రెండో డోస్ తీసుకొని వారిని గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. వాక్సినేషన్ లో ఏమర పాటుగా ఉండొద్దన్నారు. మూడో వేవ్ కు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో డీఎంహెచ్వో డా. మనోహర్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. విజయ రాణి తదితరులు పాల్గొన్నారు.