గజ్వేల్, డిసెంబర్ 18 : గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ ఏడాది క్రిస్మస్ కానుకలను 4 వేల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. గతేడాది 3వేల కుటుంబాలకు క్రిస్మస్ కానులు అందించగా, ఈ సంవత్సరం మరో వెయ్యి కుటుంబాలకు అందిస్తున్నారు. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్, వర్గల్, ములు గు, మర్కూక్, జగదేవ్పూర్, కొండపాక, తూ ప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన 4వేల క్రిస్టియన్ కుటుంబాలకు కానుకలను అందిస్తుండగా, ఆయా చర్చిల ఫాదర్లు, పాస్టర్లకే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అధికారులు అప్పగించారు. సోమవారం గజ్వేల్ క్రిస్టియన్ భవన్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయనున్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో జరిగే నూతన ఆత్మకమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోను మంత్రి హరీశ్రావు పాల్గొనున్నారు.