రాయపోల్, డిసెంబర్ 18 : వ్యవసాయ రం గంలో రికార్డు స్థాయిలో దిగుబడులు సాధిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతుల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం రాయపోల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జగదాంబ రైస్ ఇండస్ట్రీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం దిగుబడి సాధించిందన్నారు. రైతులకు 24గం టల ఉచిత కరెంట్, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుదని సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ రైతులు నేడు అత్యాధునిక పద్ధతులు పాటించి దిగుబడులు సాధించడం ఆభినందనీయమన్నారు. తెలంగాణలో పండిన పంట పూర్తిగా కొనుగోలు చేసిన ఘనత సీఎం కీసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, జడ్పీటీసీ యాదగిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మామిడి మోహన్రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, కల్లూ రు శ్రీనివాస్, సర్పంచ్, ఎంపీటీసీ పాల్గొన్నారు.
రాజక్కపేట-ఎల్లాపూర్ బ్రిడ్జి నిర్మాణానికినిధులు మంజూరుకు హామీ
దుబ్బాక మండలం రాజక్కపేట-ఎల్లాపూర్ మధ్యలో బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధుల మంజూరుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం దుబ్బాక మండలం రాజక్కపేటలో పర్యటనలో భాగంగా రాజక్కపేట-ఎల్లాపూర్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాజక్కపేట ఎంపీటీసీ మమతారాధామనోహర్ ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రాజక్కపేట-ఎల్లాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులకు ఎంపీ ఆదేశించారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి కావల్సిన నిధులు మంజూరు చేస్తామన్నారు. రాజక్కపేట గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆనంతరం గ్రామానికి చెందిన రిపోర్టర్ యాదగిరి తన కొడుకు మృతి చెందిన విషయం తెలసుకుని వారి కుటుంబానికి ఎంపీ ఆర్థిక సాయం అందజేశారు. ఎంపీ వెంట దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీటీసీలు మమతారాధామనోహర్, చం ద్రసాగర్, బీఆర్ఎస్ నాయకులు వెంకటనర్సింహారెడ్డి, కొత్త కిషన్రెడ్డి తదితరులు ఉన్నారు.