చేర్యాల, డిసెంబర్ 18 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆదివారం అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో మల్లన్నక్షేత్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తనతో పాటు హు స్నాబాద్ ఏసీపీ సతీశ్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, చేర్యాల సీఐ శ్రీనివాస్, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్, 280 మంది పోలీసులతో భక్తులకు సేవలందించినట్లు తెలిపారు. స్వామివారి క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా వీహెచ్ఎఫ్ సెట్ ద్వారా పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తూ బందోబస్తు పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు.
భక్తురాలికి పర్సును అప్పగించిన పోలీసులు
హైదరాబాద్కు చెందిన జోగిని ఎర్ర అనురాధ స్వామి వారి కల్యాణోత్సవానికి వచ్చి తన పర్సు పోగొట్టుకుంది. అందులో రెండు ఆపిల్, వన్ ప్లస్ ఫోన్తో పాటు రూ.3వేల నగదు ఉంది. విధుల్లో ఉన్న సిద్దిపేట రూరల్ పీసీలు రవిరాజుకు తోటబావి వద్ద పర్సు దొరకడంతో విచారించి బాధితురాలికి అందజేసినట్లు అడిషన్ డీసీపీ మహేందర్ తెలిపారు. అందులో ఉన్న విజిటింగ్కార్డు అధారంగా బాధితురాలిని గుర్తించినట్లు తెలిపారు. బందోబస్తులో ఏసీపీ సతీశ్, సీఐ శ్రీనివాస్, పీసీ రవిరాజు తదిత రులు పాల్గొన్నారు.