కొండపాక, జూన్ 27 : సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కొండపాక మండలంలోని మేథీన్పూర్, వెలికట్ట (ఆరెపల్లి) గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, విలేజ్ ఫంక్షన్ హాల్, కొండపాకలో ఐవోసీ – సమీకృత కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి రైతువేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటి అడుగు జాగలో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 57 ఏండ్లు దాటిన వృద్ధులకు పింఛన్, అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి భరోసా కల్పించారు. టీఆర్ఎస్ ఇంటి పార్టీగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
వెలికట్ట గ్రామం గతంలో అభివృద్ధికి నోచుకోక ఆమడదూరంలో ఉండేదని, తెలంగాణ ఏర్పడి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆరెపల్లి నుంచి జనగామ వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి సూచించారు. గ్రామంలో కుల సంఘాల భవనాల కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, నేటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమఅవుతాయన్నారు. రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు అందజేసిన సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా 24 గంటల కరెంట్, కొరత లేని ఎరువులు అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని గ్రామా ల్లో పచ్చదనం పరుచుకున్నదన్నారు. ఇది ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
ప్రజాసంక్షేమం కోసం కృషిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీడబ్ల్యూఐటీసీ చైర్మన్ రాగుల శ్రీధర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఎంపీపీ ర్యాగళ్ల సుగుణాదుర్గయ్య, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ఎంపీపీ దేవీ రవీందర్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి, మండల కన్వీనర్ ర్యాగళ్ల దుర్గయ్య, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణారవీందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు చిట్టి మాధురి, వెలికట్ట సర్పంచ్ అమ్ములారమేశ్, మేథీన్పూర్ సర్పంచ్ దశరథం, కొండపాక ఎంపీటీసీ ఆరుట్ల లక్ష్మీకనకయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనెకుమార్యాదవ్, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తహసీల్దార్ అహ్మద్హుస్సేన్, ఎంపీడీవో రాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్రావు, టీఆర్ఎస్ మండల నాయకులు పోల్కంపల్లి నరేందర్, రుషి, గోనె శ్రీనివాస్ పాల్గొన్నారు.