రామాయంపేట, జూన్ 27: ఉచిత శిక్షణా శిబిరంలోని అభ్యర్థులందరూ బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని, అందరినీ పోలీస్ డ్రెస్సుల్లో చూడాలని మెదక్ ఎమ్యెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేటలోని అయ్యప్ప ఆలయంలో 560 మంది ఉద్యోగ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభ్యర్థులంలా బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. 69 రోజులుగా శిక్షణకు హాజరైన అభ్యర్థులు ఇంటికెళ్లి ఉద్యోగ సాధనకు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కృషితో ప్రతిఒక్కరూ ఉద్యోగాలు పొందాలన్నారు.
పాటలతో అలరించిన దేశపతి శ్రీనివాస్
రామాయంపేటలోని ఉచింగ్ కోచింగ్ సెంటర్కు చేరుకున్న ప్రభుత్వ సలహా దారు దేశపతి శ్రీనువాస్ అభ్యర్థులను తన తెలంగాణ పాటలతో అలరించారు. ఎమ్మెల్యే పద్మారెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డిల కృషితో ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇచ్చారన్నారు. అభ్యర్థులందరూ వారి పేరు నిలబెట్టేలా బాగా చదివి ఉద్యోగం సాధించాలన్నారు. దేశపతి పాటలు అభ్యర్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బాలస్వామి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు జగదీశ్వర్రెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, బాపురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలి: దేశపతి
అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మెదక్లోని ద్వారకా గార్డెన్స్లో నిర్వహించిన ఉద్యోగ శిక్షణ ముగింపు సమవేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామాకాల కోసం పోరాటం చేసి ఆర్డీవో నుంచి అటెండర్ వరకు 95శాతం స్థానికులకు హక్కు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ 60 రోజు లు కష్టపడి చదివి అనుకున్న గమ్యం సాధించొచ్చన్నారు. స్టడీ మోటీరియల్ను నిత్యం చదవాలని, బిట్స్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలని తెలిపారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి డీఎస్సీ సైదులు, పీజేఆర్ శిక్షణా కేంద్రం డైరెక్టర్ జగదీశ్వర్, మెదక్ రూరల్ సీఐ, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.