గజ్వేల్ అర్బన్, మే 24 : రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి, భరోసానిస్తున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తూ రైతులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 8 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో 3లక్షల 55వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందని, ఇంకా కొనుగోళ్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. దేశంలో రైతులకు మద్ధతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తు న్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడడం మానుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఉంటే చెప్పాలని డిమాండ్ చేశా రు. కపట ప్రేమ ఒలకబోస్తున్న బీజేపీ.. రైతు వ్యతిరేక చట్టాలు ఎం దుకు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు.
కొనుగోళ్లలో వేగం పెంచాలి : ఆర్డీవో జయచంద్రారెడ్డి
చేర్యాల, మే 24 : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించాలని హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఆర్డీవో పీఏసీఎస్ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలపై సూచనలు చేశారు. అనంతరం చేర్యాల వ్యవసాయ మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ సర్పంచ్లతో మాట్లాడి ట్రాక్టర్లను కిరాయికి తీసుకొని ధాన్యం తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని తరుగు పెట్టకుండా చూడాలని సూచించారు. గన్నీ సం చులు వెంటనే పంపించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, తహసీల్దార్ గియాసున్నీసాబేగం, ఎంపీడీవో తారిఖ్అన్వర్, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ జిల్లా రాజేశం, ఏపీవో శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ సీఈవో రాములు పాల్గొన్నారు.