గజ్వేల్ రూరల్, నవంబర్9 : గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొడకండ్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి గడిచిన ఏడున్నరేండ్ల కాలంలో అధిక ప్రాధాన్యతను కల్పించిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణ, ఎంపీపీ దాసరి అమరావతి, సర్పంచ్ ,ఎంపీటీసీలు అశోక్, కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు మధు, నవాజ్మీరా, భీమప్ప, భాస్కర్ తదితరలు పాల్గొన్నారు.