రాయపోల్, మార్చి 13 : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రేపటి నుండి జరగబోయే ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి చక్కని ప్రతిభ కనబర్చాలని కోరారు. వార్షిక పరీక్షల్లో విజయం సాధిస్తారని మనసారా ఆశిస్తున్నట్లు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
జీవితంలో మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున విద్యార్ధులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులందరూ సమయానికి పరీక్ష కేంద్రాలకు వెళ్లి.. ప్రశాంతంగా పరీక్షలు రాసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాంక్షించారు.