రాయపోల్, జనవరి 19 : రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ గౌస్ కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) పరామర్శించారు. గౌస్ మృతి వార్త విని కలత చెందిన ఆయన.. సోమవారం బాధిత కుటుంబానికి రూ.15వేల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఫోన్లో విద్యుత్ శాఖ ఎస్సీతోమాట్లాడిన ప్రభాకర్ రెడ్డి.. విద్యుత్ ప్రమాదం కింద వచ్చే పరిహారాన్ని గౌస్ కుటుంబానికి తొందరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు.
బీఆర్ఎస్లో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన గౌస్ విద్యుత్ షాక్ మృతిపట్ల ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. గౌస్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో.. రాయపోల్ మాజీ జడ్పీటీసీ యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ.
మంతూర్ సర్పంచ్ ఫర్వేజ్ అహ్మద్, ఎల్కల్ సర్పంచ్ పిట్ల వెంకటయ్య, ఉమ్మడి మండల మాజీ ఏఎంసీ చైర్మన్ పడగంటి శ్రీనివాస్ గుప్త, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి. జిల్లా బీఆర్ఎస్ యువజన నాయకులు ఇప్ప దయాకర్, మండల యువజన అధ్యక్షులు గల్వా దయాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.