సంగారెడ్డి, ఏప్రిల్ 11: మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయంలో ఎన్నికల ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారిగా పనిచేసి వెంకట్రామిరెడ్డిని ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ బరిలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో సంయుక్త కలెక్టర్గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి చిత్తశుద్ధి కలిగిన మానవతావాది వెంకట్రామిరెడ్డి అని, పీవీఆర్ ట్రస్టుతో పేదలకు విద్యనందించే గొప్ప మనస్సుకు ప్రజలందరి మద్దతు ఉంటుందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ పట్నం మాణిక్యం, నాయకులు నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, చీల మల్లన్న, పెరుమాళ్ల నర్సింహులు, కాసాల రాంరెడ్డి, విఠల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, కౌన్సిలర్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.