మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్16: కేసీఆర్ గిరిజనుల పక్షపాతి అని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ ను 10శాతంకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందన్నారు. గిరిజనుల రిజర్వేషన్ ను 12శాతం పెంచుతామని ఎన్నికలకు ముందు హామీనిచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
గిరిజనుల రిజర్వేషన్ ను పెంచి నాలుగు ఏండ్లు గడుస్తున్నాయని తెలిపారు. రిజర్వేషన్లను పెంచిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన(గురువారం )మండలంలోని అన్ని గిరిజన గ్రామ పంచాయతీలలో కృతజ్ఞత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.