తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వడ్ల వెంకటయ్య (70) అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం మృతి చెందిన వెంకటయ్య భౌతికకాయానికి గ్రామ సర్పంచ్ బండారు కవిత గౌడ్తో కలిసి రాంరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య రాధమ్మతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.
కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. వెంకటయ్య మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాంరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కొండ సాహితి సురేష్, నాయకులు సింగోజి కృష్ణ, పాత్కుల లక్ష్మణ్, షాదుల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.