జగదేవ్పూర్ మే20 : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప రైతువేదిక భవనంలో ఏర్పాటు చేసిన వానాకాలం పంటల సాగు, ముందస్తు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పెరిగిన సాగు ఖర్చులను తగ్గించేకునేందుకు గాను రైతులు సేంద్రియ పంటల సాగు చేపట్టాలని సూచించారు.
వానాకాలం పంటల సాగులో జీలుగ జనుము వేసుకొని దుక్కులను కలియదున్నినైట్లెతే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అయిల్ పామ్ పంటల సాగుకు రైతులకు ప్రభుత్వం పోత్సాహం అందిస్తుందన్నారు. భూమి ఉన్నవారు అయిల్ పామ్ సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మితిమీరిన ఎరువుల వాడకం భూసారం తగ్గించడంతో పాటు దిగుబడులు తగ్గి రైతును ఆర్థికంగా నష్టపరుస్తుందన్నారు.
సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారానే అధిక దిగుబడులు సాధించొచ్చన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సరోజిని, ఎంపీపీ బాలేశంగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, సర్పంచ్ బాల్లక్ష్మి పాల్గొన్నారు.