పాపన్నపేట, జనవరి 14 : మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్,మధుసూదన్ రెడ్డి, రవివీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ప్రతాప్రెడ్డి, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్, యాదగిరి ఏర్పాట్లు చేశారు.
వేద పండితులు శంకరశర్మ, పార్థీవ శర్మ, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్సై మహిపాల్రెడ్డి బందోబస్తు చర్యలు చేపట్టారు.