తొగుట, డిసెంబరు 16 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ వద్ద చోటు చేసుకుంది. తొగుట సీఐ రవీందర్ కథనం మేరకు..మల్లన్న సాగర్లో పనులు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఆర్సీ కంపెనీకి చెందిన (టీఎస్ 15 యూఏ 3123) గల నెంబరు గల డీజిల్ ట్యాంకర్ను తీసుకొని వాహనాల్లో డిజీల్ పోయడానికి వెళ్తుండగా.. బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న సూపర్వైజర్ ఖమ్మం జిల్లా సోమవరంకు చెందిన కంసానీ రాజేష్ (29), హెల్పర్ మధ్యప్రదేశ్కు చెందిన హీనవాల్ కోరి (31) అక్కడికక్కడే మృతి చెందారు. ఏపీలోని విశాఖ పట్నానికి చెందిన డ్రైవర్ అక్కన్నాయుడుకు గాయాలయ్యాయి.
హీరాలాల్ తమ్ముడు కోఠి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.