సిద్దిపేట : నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు అందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు గజ్వేల్ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జాతీయ మాల మానాడు నాయకులు తుమ్మ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు పొన్నల కుమార్, డీబీఎఫ్ రాష్ట్ర నాయకుడు దాసరి ఏగొండ స్వామి, అభినవ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం శివ కుమార్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు చిప్పల యాదగిరి, మాల మహానాడు యువజన నాయకుడు నీరుడి స్వామి, సాహసం జిల్లా అధ్యక్షుడు కొడకల నర్సింలు, చిప్పల యాదగిరి అంబేద్కర్ సంఘాల నాయకులు పాములపర్తి స్వామి, మోచే ప్రభాకర్ బయ్యారం పంగ మోహన్ బాబు, గలెంక శ్రీనివాస్, క్యాసారం ప్రవీణ్, ప్రభాకర్, మిట్టు తదితరులు పాల్గొన్నారు.