చిలిపిచెడ్(కొల్చారం)/చేగుంట, ఏప్రిల్ 27: కాంగ్రెస్కు ఓటేస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శనివారం చిలిపిచెడ్, కొల్చారం, చేగుంట మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిట్కుల్, దుంపలకుంట, రంగంపేట్, చిన్న ఘనపూర్, పోతంశెట్పల్లి, అప్పాజిపల్లి గ్రామాల్లో రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. చేగుంట మండలంలోని వడయారం గోల్డెన్ షంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దేశానికి పెనుముప్పు కలుగుతుందని, దేశద్రోహులు పెరిగిపోతారని, కుంభకోణాలు, అన్యాయాలు జరుగుతాయన్నారు. అబద్ధ్దాలు, అసత్యపు మాటలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు దయాకర్గౌడ్, నాయకులు మురళీయాదవ్, ఆంజనేయులుగౌడ్, హరీశ్, గిరి, గంగరాజు, వెంకట్, కృష్ణ పలువురు పాల్గొన్నారు. చేగుంట, నార్సింగి మండలాల మహిళా అధ్యక్షురాళ్లు లావణ్య, సుతారి రాజ్యలక్ష్మి, మాజీ జడ్పీటీసీ కర్ణశోభ పాండు, ఏంఎసీ మాజీ చైర్మన్ గడ్డమీది సుజాత,మహిళా నాయకురాలు జ్యోతి, పార్టీ చేగుంట మండల అధ్యక్షుడు చింతల భూపాల్, బాల్రెడ్డి,ర్యాపాకుల సతీశ్గౌడ్, కర్ణపాండు, గోవింద్, రతన్లాల్ తదితరులు పాల్గొన్నారు