చేర్యాల, మే20 : సిద్దిపేట మండలం కడవేర్గు గ్రామ శివారులో గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళలలో వ్యవసాయ బావుల వద్ద ఎలుగుబంటి తిరుగుతుండడంతో రైతులు వణికిపోతున్నారు.
ఎలుగుబంటి ఎప్పుడు తమపై దాడి చేస్తుందోనన్న భయంతో రైతులు బావుల వద్దకు వెళ్లడం లేదు. ఎలుగుబంటి సంచారిస్తున్న దృశ్యాలను కొంతమంది యువకులు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీశారు. ఫారెస్టు అధికారులు తక్షణమే స్పందించి, ఎలుగుబంటిని పట్టుకొని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.