Reunion | రాయపోల్ : వారంతా 50 సంవత్సరాల క్రితం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలిసి చదువుకున్నారు. 1972- 75 సంవత్సరంలో సిద్దిపేటలో డిగ్రీ చదువుకున్న పూర్వ విద్యార్థులంతా రాయపోలు మండలం వడ్డేపల్లి గ్రామంలో కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈవెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, తమ అభిప్రాయాలను ఒకరినొకరు పంచుకున్నారు.
అలాగే తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాలు డిగ్రీ చదువుకున్న వారందరినీ గుర్తుంచుకొని కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి, గాల్ రెడ్డి,నాగ భూషణం, అంజయ్య, జయసూర్య , రామచందర్ రెడ్డి, నరసింహారెడ్డి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Current Wires | ఇంటిపై విద్యుత్ తీగలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?