సిద్దిపేట : 75 వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. శనివారం అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకుకలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శ్వేతా (CP) , ముజమ్మిల్ ఖాన్ (అడిషనల్ కలెక్టర్), మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ,కౌన్సిల్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, పట్టణ ప్రజలు,విద్యార్థులు, యువకులు ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఫ్రీడమ్ రన్లో భాగంగా 300 మీటర్ల జాతీయ జెండాను వాడ వాడలా ర్యాలీ తీస్తూ ప్రదర్శించారు. అనంతరం శాంతికి ప్రతీకగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బెలూన్ లను ఎగురవేశారు.