సిద్దిపేట, ఫిబ్రవరి 21: భవిష్యత్ అంతా కంప్యూటర్దేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలను కార్పొరేట్కు తలదన్నే రీతిలో అభివృద్ధి చేశామన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో పెచ్చులూడుతూ ఉండేదని, దీంతో విద్యార్థులు భయపడుతూ చదువు కొనసాగించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. త్వరలోనే మంచి కంప్యూటర్ బోధకులను పాఠశాలలో ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇక భవిష్యత్ మొత్తం కంప్యూటర్ దే అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు మించిన విధంగా డిజిటల్ ప్యానల్స్తో కంప్యూటర్ ల్యాబ్ను అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయించామన్నారు.
టెన్త్ పరీక్షలో పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రతి ఒకరూ రెండు నెలలు కష్టపడి చదువుకోలన్నారు. నేడు కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానంలో భాగమైందన్నారు. జిల్లాలో ఎకువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇదని, ఈసారి టెన్త్లో వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. మీరు బాగా చదువుకోండి భవిష్యత్ మీచేతిలోనే ఉందన్నారు. మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పదిలో 100 శాతం మారులు సాధించడమేనన్నారు. సిద్దిపేట నియోజకవర్గం టెన్త్లో ప్రథమ స్థానంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ పూర్ణిమా ఎల్లం, ప్రిన్సిపాల్ మనోహర్, ఎంఈవో యాదవరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.