సిద్దిపేట టౌన్, డిసెంబర్ 21 : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మారో అరుదైన ఘనతను సాధించింది. ఇంతవరకు ఏగ్రేడ్గా ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాల ఏ-ప్లస్ గ్రేడ్ను కైవసం చేసుకొని రాష్ట్రంలో రెండో కళాశాలగా తన ప్రత్యేతను చాటుకుంది. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నాల్గో న్యాక్ ఇయర్ టీం సందర్శించింది. కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక వసతుల కల్పన పరిశోధన పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించి కళాశాలకు 7 కైటీరియా వైజ్గా మార్కులు కేటాయించి ఏ ప్లస్ గ్రేడ్ను గురువారం ప్రకటించింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సిద్దిపేట డిగ్రీ కళాశాల 3.14తో ఏ గ్రేడ్గా ఉండేదని, ఇప్పుడు 3.5తో ఏ ప్లస్ గ్రేడ్ను కైవసం చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. అందరి సమష్టి కృషితో ఏ గ్రేడ్ను సాధించామని అధ్యాపకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో విద్యార్థులు పటాకాలు కాల్చి సంబురాలు నిర్వహించారు.