సిద్దిపేట అర్బన్, జూలై 21: సమయం వృథా చేయకుండా దృఢ సంకల్పంతో చదవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యార్థులకు సూచించారు. గురువారం మండలంలోని ఎన్సాన్పల్లిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలున్నాయా? అని ఆరా తీశారు. పాఠశాలలో 480 మం ది విద్యార్థులు చదువుతున్నారని, 24 గదులు మాత్రమే ఉన్నాయని సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. పాఠశాలలో ల్యాబ్ గదులతో కలిసి 8 గదులు కావాలని కలెక్టర్కు సూచించారు. స్పం దించిన కలెక్టర్ పాఠశాల భవనం పైన రేకులతో కూడిన గదులను సిద్ధం చేస్తామన్నారు. గదులతోపాటు టాయిలెట్లు కూడా ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో 8 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా, మూడు పాఠశాలల్లో మా త్రమే శాశ్వత భవనాలు ఉన్నాయని, మిగతా 5 అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. ముఖ్యం గా అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలల్లో డ్రైనేజీ వ్యవస్థ, గదుల కొరత కనిపిస్తున్నదని తెలిపారు. సమస్యను తీర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గజ్వేల్, వర్గల్, జగదేవ్పూర్ మండలాల్లో నడుస్తున్న పాఠశాలల సమస్యలు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. అన్ని పాఠశాలలు సందర్శిస్తానని, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరిత, మం త్రి ఓఎస్డీ బాలరాజు, సర్పంచ్ రవీందర్గౌడ్, ఎంపీటీసీ స్రవం తి ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.