సిద్దిపేట, ఫిబ్రవరి 24: టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కార్యాలయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్ అధికారులతో మం గళవారం ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14నుంచి ఏప్రిల్ 16 వరకు 82 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం 15358 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు 82, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 82, కస్టోడియన్ ఆఫీసర్లు తొమ్మిది మందిని నియమించినట్లు తెలిపారు. 82 కేంద్రాల్లో వాష్ రూమ్స్ క్లీనింగ్, వాటర్ సౌకర్యం, సెంటర్లో ఏఎన్ఎం,మెడికల్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సెంటర్కు వచ్చేలా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి పాల్గొన్నారు.