మర్కూక్, జనవరి 19: ఆయిల్పామ్ మొక్కలకు తొలి దశలో వచ్చే పూల గుత్తులను తొలిగించుకోవాలని సిద్ద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మర్కూక్లో రైతు జీవన్రెడ్డి ఆయిల్పామ్ తోటను మండల వ్యవసాయ అధికారి నాగేందర్రెడ్డితో కలిసి ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా పూల గుత్తులను (అబిలేషన్) తీయడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్పామ్ మొక్కలు నాటిన 14రోజుల నుంచి 18 నెల ల్లో పూతకు వస్తాయన్నారు.
ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పా లు పూస్తాయన్నారు. తొలిదశలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే తొలి దశలో పూలను తీసివేయాలన్నారు. ఈ ప్రక్రియ 30నెలల వరకు చేసుకోవాలని రైతులకు సూచించారు. సంప్రదాయ నూనెగింజల కన్నా ఆయిల్పా మ్ నూనె దిగుబడి 5రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఆయిల్పామ్ నాటిన 4వ ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతరం ఆదాయం పొందవచ్చని తెలిపారు.