జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు
లెప్రసీ నోడల్ అధికారులతో సమీక్ష
మెదక్ రూరల్, మే 19 : జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధి నమోదు కేసులను గుర్తించాలని, వ్యాధిగ్రస్తుల వివరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి జిల్లా అదనపు సంచాలకుడు లెప్ర సీ డాక్టర్ రవీందర్నాయక్ ఆదే శించారు. మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ‘కుష్టు వ్యాధి గుర్తింపు- నిర్మూలన’ పై గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే లెప్రసీ నోడల్ అధికారులతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముఖ్యఅతిథిగా అదనపు సంచాలకుడు రవీందర్నాయక్ పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో లెప్రసీ కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని, కేసుల గుర్తిం పుపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని పీహెచ్సీ సూపర్వైజర్ల్లకు సూచించారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు పీబీ- 3, ఎంబీ – 18 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల్లో లెప్రసీ వ్యాధి కేసులను గుర్తించే విధంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ఆరోగ్యశాఖ సూపర్ వైజర్లు కలిసి పని చేయాలన్నారు. గ్రామల్లో లెప్రసీ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కుష్టు వ్యాధి సోకినవారికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఉచితంగా మందులు ఇస్తున్నట్లు తెలిపారు. మెడికల్ అధికారులు తమ పరిధిలో లెప్రసీ కేసులు నమోదు చేస్తున్నారా? లేదా? అనే దానిపై వైద్య సిబ్బందిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ వైద్యాధికారులు డాక్టర్ విజయనిర్మల, డాక్టర్ అనీలా, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ మాధవి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.