సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి : మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, జూన్ 26 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రూపొందించిన నూతన విద్యార్థుల స్వాగత వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకుముందు టీఆర్ఎస్వీ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పార్టీలో పనిచేసే ప్రతిఒక్కరికీ సముచిత స్థా నం ఉంటుందని, ఉద్యమంలో యువకులు, వి ద్యార్థుల పాత్ర గొప్పదని, అదే పంథాలో పార్టీలో క్రియాశీలకంగా ఉండాలన్నారు.
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బీజేపీ అబద్దాల పార్టీ అని ఎద్దే వా చేశారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్వీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలను నీతిఆయోగ్ అభినందించిందని తెలిపారు. 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేవరకు బీజేపీని నిలదీయాలన్నారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో మత కల్లోలాలు, హింస తప్ప సాధించిన గుణాత్మక మార్పు ఏం లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్, పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ నాయకులు రాచకొండ భిక్షపతి, నాగుల ప్రశాంత్, చేపూరి శేఖర్గౌడ్, టీఆర్ఎస్వీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.