హాజరైన బర్ధీపూర్ ఆశ్రమ పీఠాధిపతి
వైరాగ్యశిఖామణి అవదూతగిరి మహారాజ్
గురుగంగాధరస్వామి ఆశ్రమ పీఠాధిపతి
శివయోగిశివాచార్యస్వాములు
ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి
లేబర్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి
గుమ్మడిదల, మే 8 : జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బొంతపల్లి-వీరన్నగూడెంలోని వీరభద్ర ఆలయం ప్రాంగణంలో ఆదివారం ఉదయం నాలుగు రాజగోపురాలకు శిఖర కలశాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమా లను ఆలయ కమిటీ చైర్మన్ భద్రప్ప, ఈవో శశిధర్గుప్తా, ధర్మకర్తలు, బొంతపల్లి- వీరన్నగూడెం పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం బలిహర ణం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
శిఖర ప్రతిష్ఠాపనకు హాజరైన ఆశ్రమ పీఠాధిపతులు
బర్ధీపూర్ ఆశ్రమపీఠాధిపతి శిఖామణి అవదూత గిరిమహారాజ్, గురుగంగాధర ఆశ్రమ పీఠాధిపతి శివయోగి శివాచార్యస్వామి ఉత్సవాలకు హాజరయ్యారు. యంత్ర, శిఖర కలశ ప్రతిష్ఠాపన, జీవాత్మ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు.
ఉత్సవాలకు హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే
శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ మర్యాదలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు శిఖరకలశ దర్శనం చేసుకున్నారు.
శిఖరదర్శనం చేసుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలను హాజరై శిఖర దర్శనం చేసుకున్నారు. వీరభద్రస్వామి, భద్రకాళీ మాత సన్నిధిలో ప్రత్యేక పూజలుచేసి, నాలుగు శిఖరాల కలశాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దాతల విరాళాలను వివరించే శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆలయంలో రాజగోపురాలు, సాలారాలు, ప్రాకారాలు, నిత్యకల్యాణ మండపం, కోనేరు, సత్రాలను పూర్తి చేసిన ఆలయ చైర్మన్, ఈవో, ధర్మకర్తలను ఎమ్మెల్యే అభినందించారు. ఉత్సవాలకు ఎంపీపీ ప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, సర్పంచ్లు నవీనాశ్రీనివాస్రెడ్డి, మమతావేణు, రాజశేఖర్, నర్సింహారెడ్డి, మాజీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, నాగేందర్గౌడ్, విజయభాస్కర్రెడ్డి, ధర్మకర్తలు వీరమల్లేశ్, లక్ష్మీనారాయణ, గోపిగౌడ్, రాజు, కృష్ణగౌడ్, జహంగీర్రెడ్డి, నేతలు మహ్మద్హుస్సేన్, గోవర్ధన్రెడ్డి, నరేందర్రెడ్డి, కుమార్, గోపాల్, వినోద్గౌడ్, చక్రపాణి తదితరులు హాజరయ్యారు.