మనోహరాబాద్ : కుటుంబ సభ్యులంతా శనివారం రాత్రి కలిసి భోజనం చేసి నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి కుమార్తె అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన పర్స కృష్ణయ్యకు భార్య కనకవ్వ, కుమారుడు నవీన్, కుమార్తె కల్యాణి ఉన్నారు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసే భోజనం చేసి నిద్రించారు.
ఆదివారం తెల్లవారుజామున కృష్ణయ్య లేచి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన అతడు బంధువులు, ఇరుగుపొరుగు ఇండ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో మనోహరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్తెలిపారు.