సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 15 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో విరాజిల్లుతున్నది. ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల గత ప్రభుత్వంలో హరీశ్రావు చొరవతో నాట్కో సౌజన్యంతో డిజిటల్ బోధన, కంప్యూటర్ ల్యాబ్తో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అదే తరహాలో మల్టీ పర్పస్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్లను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం గర్ల్స్ హైస్కూల్లో మాజీ మంత్రి హరీశ్రావు కృషితో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు డిజిటల్ బోధనకు 8 క్లాస్ రూమ్ల్లో 8 స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
దాదాపు రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో గర్ల్స్ హైస్కూల్లో 21 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటైంది. పనులు తుది దశకు చేరుకున్నందున త్వరలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించనున్నారు. తమ పాఠశాలను ఒక కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తూ.. కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీశ్రావుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఒక అన్నలా ప్రోత్సహిస్తూ తమలో వెలుగులు నింపుతున్న హరీశ్రావుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.